సుప్రసిధ్ధ సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తి రాసిన ఏకైన నవల "జీవనరాగం". వారి తొలి రచన. 1959లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో సీరియల్ గా ప్రచురితమైంది. తర్వాత 1970 లో పుస్తకరుపాన్ని దాల్చింది. నా దగ్గర ఉన్నది అప్పటి ప్రింట్. తర్వాత పున:ముద్రణ జరిగిందో లేదో తెలియదు. నాకు తెలుగు చదవడం వచ్చిన కొత్తల్లో ఇంట్లో చదవటానికి దొరికిన ప్రతి తెలుగు పుస్తకాన్ని వదలకుండా [...]




